ఏటీఎం చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి యత్నం

Jun 4 2025 7:46 AM | Updated on Jun 4 2025 7:46 AM

ఏటీఎం చోరీకి యత్నం

ఏటీఎం చోరీకి యత్నం

నిందితుడి రిమాండ్‌

జిన్నారం (పటాన్‌చెరు): ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్‌ రెడ్డి కథనం ప్రకారం... నిందితుడు మాలి గణేశ్‌ మహారాష్ట్ర నుంచి వలస వచ్చి బీరప్ప బస్తీలో నివాసముంటున్నాడు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో బీరప్ప బస్తీలోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంను గడ్డపారతో ధ్వంసం చేసే క్రమంలో అలారం మోగడంతో వెంటనే పారిపోయాడు. ఏటీఎం సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి గతంలో కూడా బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement