
మా భూమిలోకి మమ్మల్ని రానివ్వడం లేదు
సిద్దిపేటజోన్: డబ్బులు పెట్టి కొన్న మా భూమిలోకి రానివ్వడం లేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక వద్ద చోటు చేసుకుంది. బాధితులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు. బాధితు ల కథనం ప్రకారం.. రాఘవేంద్రనగర్ పరిధిలో 1996లో 21 మంది ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. 2023లో అశోక్, మహేందర్ ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని ఆరోపించారు. కొద్ది రోజులుగా అక్కడికి రాకుండా అడ్డుకోవడం, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు.
ఎదుగుదల ఓర్వలేక కుట్ర..
రాజకీయ ఎదుగుదల ఓర్వలేక తనపై కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు మహేందర్ విమర్శించారు. సోమవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ వెంచర్లో ప్లాట్లు కొని కొందరు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 2000లో రికార్డుల ప్రకారం 4 ఎకరాల్లో కాకుండా 18 ఎకరాలు ఉన్నట్లు తప్పుడు పత్రాలతో రియల్ వ్యాపారులు కబ్జా చేసినట్లు ఆరోపించారు. తనపై ఆరోపణలు చేసి ఫ్ల కార్డులతో నిరసన చేసిన వారిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.
న్యాయం చేయాలని మంత్రికి వినతి
ఫ్ల కార్డులతో బాధితుల నిరసన