సోషల్‌ మీడియా పుకార్లు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా పుకార్లు నమ్మొద్దు

Jun 3 2025 7:02 AM | Updated on Jun 3 2025 7:02 AM

సోషల్‌ మీడియా పుకార్లు నమ్మొద్దు

సోషల్‌ మీడియా పుకార్లు నమ్మొద్దు

సిద్దిపేట ఏసీపీ రవీందర్‌ రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాతే పోస్ట్‌లు పెట్టాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సిద్దిపేట టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాజీత్‌ పుర, కరీంనగర్‌ రోడ్‌, అంబేడ్కర్‌ నగర్‌, సంజీవయ్య నగర్‌, తదితర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసుల సలహాలు, సూచనలు పాటించి శాంతి భద్రతలో ప్రజలు, యువకులు భాగస్వామ్యం కావాలన్నారు. డయల్‌ 100, సిద్దిపేట పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 87126 67100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వన్‌ టౌన్‌ సీఐ వాసుదేవరావు, టూటౌన్‌ సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement