కూరగాయలకు వెళ్లొస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

కూరగాయలకు వెళ్లొస్తుండగా..

Jun 3 2025 7:02 AM | Updated on Jun 3 2025 7:02 AM

కూరగాయలకు వెళ్లొస్తుండగా..

కూరగాయలకు వెళ్లొస్తుండగా..

మర్కూక్‌(గజ్వేల్‌): రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలు అయ్యా యి. ఈ ఘటన మర్కూక్‌ మండలంలోని పాములర్తి గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ములుగు ఎస్‌ఐ దామోదర్‌ కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొండారెడ్డి చెరువు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య(33), కుమారుడు కర్రె జీవన్‌ (13) ఇద్దరూ వ్యాపారం నిమిత్తం కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్‌పై ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్‌కు వచ్చారు. కూరగాయలు కొనుగోలు చేసుకొని తిరిగి వెళ్తుండగా మండలంలోని పాములపర్తి గ్రామ శివారులో ముందుగా వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌లో గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జీవన్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కనకయ్యను మెరుగైన వైద్యం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్‌

కుమారుడు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement