
వీహెచ్పీ కార్యదర్శిపై దాడి : కేసు నమోదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వహిందూ పరిషత్ మెదక్ సహ కార్యదర్శి గ్యాదరి రాజారాంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ ఉపేందర్ సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని సాజీద్పుర కాలనీ గుండా వెళ్తుండగా ఓ వర్గం వారు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులు చేశారని, రాజారాం సోదరుడు గ్యాదరి గోపి ఫిర్యాదు చేశాడు. అదే విధంగా గ్యాదరి రాజారాం తమ ఇంటికి వచ్చి రాళ్లు విసిరారని ఓ వర్గానికి చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాదరి రాజారాంను మెదక్ ఎంపీ రఘునందన్రావు, వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, సీపీ అనురాధను ఎంపీ రఘునందన్రావు కోరారు. రాజారాంపై భౌతిక దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.