\\192.168.1.32\Finalserver\Cfo\2023-06-28\28-MEDAK-HALF-PAGE-R | - | Sakshi
Sakshi News home page

\\192.168.1.32\Finalserver\Cfo\2023-06-28\28-MEDAK-HALF-PAGE-R

Jun 28 2023 3:46 AM | Updated on Jun 28 2023 3:46 AM

కరాటే పోటీల్లో

సిద్దిపేట విద్యార్థుల ప్రతిభ

సిద్దిపేటజోన్‌: జపాన్‌ కరాటే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తుర్కపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్లాక్‌ బెల్ట్‌ పోటీల్లో సిద్దిపేట విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 31మంది బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు. కటాస్‌, కుమితే, వెపన్‌, బ్రేకింగ్‌ టెక్నిక్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్ర ముఖ సినీహీరో, డాక్టర్‌ సుమన్‌ తల్వార్‌ హా జరై విజేతలకు బెల్ట్స్‌ అందచేశారు.

శాంతిభద్రతలకు

ప్రజలు సహకరించాలి

పెద్దశంకరంపేట(మెదక్‌): శాంతిభద్రతలకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అల్లాదుర్గం సీఐ జార్జ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపేటలో కమ్యూనిటీ కనెక్టింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను పోలీసులకు సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలు రోడ్డు భద్రత, సైబర్‌నేరాలు, సీఐఈఆర్‌( దొంగతనం ఫోన్ల రికవరీ)లపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు. ఎవరైన కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమచారం అందించాలని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సమస్యలు పరిష్కరించాలని

రాస్తారోకో

మెదక్‌జోన్‌: ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం విద్యార్థులతో కలిసి పట్టణంలో రోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఎదుట కిరాణ షాపులతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మురికి కాలువ నుంచి వచ్చే దుర్గంధానికి తరగతి గదుల్లో వాంతులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై మున్సిపల్‌ అధికారులు, కలెక్టర్‌కు విన్నవించినా నాలుగు నెలలుగా పరిష్కరించలేదని ఆరోపించారు. కళశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పందులు, పశువులు లోపలికి వస్తున్నాయని, సరిపడా గదులు లేక విద్యార్థులు బయట కూర్చోని చదువుకోవాల్సి వస్తుందని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల మెమోలు మాయం

మెదక్‌జోన్‌: హవేళిఘనపూర్‌ మండలంలోని మహా త్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల మెమోలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు సమీక్ష, కావేరి, జ్యోతి, సింధూ 2020–21లో పదో తరగతి చదివారు. ఇటీవల ఇంటర్మీడియట్‌ కూడా ఇక్కడే పూర్తి చేశారు. పై చదువుల కోసం మెమోలు ఇవ్వాలని మంగళశారం ప్రిన్సిపాల్‌ రజిని కోరగా.. మెమోలు ఎక్కడో మిస్‌ అయ్యాయని, డూప్లికేట్‌ మెమోలకు దరఖాస్తు చేసు కోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మెమో లు లేకుంటే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మిస్‌ అవుతుందని విద్యార్థిని సమీక్ష ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. విద్యార్థినుల మెమోలు మిస్సయిన మాట నిజమేనని, ఈ విషయమై ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కనీస వేతనాలు అమలు చేయాలి

కొండాపూర్‌(సంగారెడ్డి): మిషన్‌ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో మిషన్‌ భగీరథ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కార్మికులకు సరిగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.26 వేలతో పాటు చట్టపరమైన సౌక ర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధా కర్‌, రాములు నాయకులు నర్సింలు, రాములు, వెంకటేష్‌, సిద్ధప్ప, కష్ణ, ప్రభాకర్‌, సుదర్శన్‌, రవి పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి

నర్సాపూర్‌: నర్సాపూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆమె నర్సాపూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి హైదరాబాద్‌లో అందజేసి, వాటికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి సునీతారెడ్డి పూలమొక్కను అందజేశారు. కాగా బీఆర్‌ఎ్‌స్‌ యువనాయకుడు సంతోష్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రి కేటీఆర్‌ అతనికి శుభాకాంక్షలు తెలిపారు.

1న ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక

గజ్వేల్‌రూరల్‌: సబ్‌ జూనియర్‌ బాలికల ఉమ్మడి మెదక్‌ జిల్లా ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికను జూలై 1న నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్‌ అసో సియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ఎర్రవాడ నాగేష్‌ తెలిపారు. మంగళవారం గజ్వేల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడు తూ మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జూలై 1న సబ్‌ జూనియర్‌ బాలికల విభా గంలో నిర్వహించనున్న ఎంపికకు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన క్రీడాకారులు మాత్ర మే హాజరు కావాలన్నారు. 2010 జనవరి 1 నుంచి 2013 డిసెంబర్‌ 31 మధ్య జన్మించిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌కార్డును వెంట తీసుకొని ఉదయం 7 గంటల్లోగా రావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు జూలై 8నుంచి 11 వరకు నిజామాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు 99087 89877, 8121392441 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌ నర్సింలు, ఫుట్‌బాల్‌ క్లబ్‌ కార్యదర్శి గణేష్‌, కోచ్‌ అజార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement