
క్రీడలకు పెద్దపీట
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సిరిసిల్లలో ఆర్చరీ అకాడమీ ప్రారంభం
సిరిసిల్లఅర్బన్/వేములవాడఅర్బన్/చందుర్తి: ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్చరీ అకాడమీని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. రాష్ట్రంలోనే ఆర్చరీ అకాడమినీ సిరిసిల్లలో ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. పదేళ్లలో క్రీడలకు రూ.400 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వంలో 11 నెలల్లోనే రూ.800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం పట్టణంలోని బతుకమ్మఘాట్ వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిప్పాపూర్లోని మినీస్టేడియం పరిశీలించి మాట్లాడారు. వేములవాడలో ఇండోర్ స్టేడియం, చందుర్తి మండలం మూడపల్లి వద్ద మినీస్టేడియం నిర్మాణాలకు స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, సూర దేవరాజు, చక్రధర్రెడ్డి, క్రీడలశాఖ అధికారి రాందాస్, శ్రీకుమార్, యెల్లె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.