
బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులు బుధవారం జిల్లా కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, పోక్సో కోర్టు, ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి బి.పుష్పలత బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తిని ఎస్పీ మహేశ్ బీ గీతే కలిసి, పూలమొక్క అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జూపెల్లి శ్రీనివాసరావు, తంగళ్లపల్లి వెంకటి, ఇతర ప్రతినిధులు ఉచ్చిడి శరత్రెడ్డి, గాజుల రాజమల్లు, నర్మెట రమేశ్, వేముల నరేశ్ జడ్జీలను కలిశారు.

బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు