
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సిరిసిల్ల: ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఉపాధిహామీ ఫీల్డ అసిస్టెంట్లు నిరసన తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నేదూరి మధు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.25వేలు చెల్లించాలని కోరారు. ఉపాధిహామీల ఉద్యోగుల లాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు ‘ఎఫ్టీఈ’లుగా కన్వర్టు చేసి వేతనాలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 24న చలో సీఆర్డీ హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు జిల్లా డీఆర్డీవో శేషాద్రికి వినతిపత్రం అందించారు.