రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి విద్యార్థులు

Jun 9 2025 7:44 AM | Updated on Jun 9 2025 7:44 AM

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి విద్యార్థులు

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి విద్యార్థులు

బొబ్బిలి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్‌ బంకురు ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్‌జూనియర్‌ విభాగంలో ఎన్‌.హర్షిత, బి వరలక్ష్మి, క్యాడెట్‌ విభాగంలో బి.భరద్వాజ్‌, జూనియర్‌ విభాగంలో బి గౌతమి, పి.సంజన, సోమేశ్‌ యాదవ్‌, బి.శివరామకృష్ణ, సీనియర్స్‌ విభాగంలో కె.అభినవ్‌, వై.కిశోర్‌ కుమార్‌, బి.రోహిత్‌, ఎన్‌.కిరణ్‌లు తాడిపత్రిలో పోటీలకు హాజరవుతున్నారన్నారు. వారంతా గత నెల 31న బొబ్బిలిలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ముందు నిలిచారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement