చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

Jun 9 2025 7:44 AM | Updated on Jun 9 2025 7:44 AM

చికెన

చికెన్‌

బ్రాయిలర్‌ లైవ్‌ డెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ115 శ్రీ200 శ్రీ210

సోషల్‌మీడియాలో

పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్టు

పాలకొండ: భామిని మండలానికి చెందిన జామి వెంకటేష్‌ అనే వ్యక్తిని సోషల్‌మీడియాలో పోస్టు పెట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆ వివరాలను సీఐ చంద్రమౌళి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్‌ పోస్టు చేయగా దానిపై వెంకటేష్‌ అసభ్యంగా కామెంట్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు వెంకటేష్‌ను అరెస్టు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులకు అడ్మిన్‌ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్సై ప్రయోగమూర్తి ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య

శృంగవరపుకోట: మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన శానాపతి సాయికుమార్‌ (26) గడ్డిమందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా సాయికుమార్‌ తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం రాత్రి విపరీతంగా కడుపునొప్పిరావడంతో భరించలేక అందుబాటులో ఉన్న గడ్డిమందును తాగేశాడు. దీంతో గమనించిన తండ్రి అప్పారావు ఎస్‌.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని కిమ్స్‌, అక్కడినుంచి కేజీహెచ్‌కు తరలించి చికిత్స అనంతరం బాగుందని ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం సాయికుమర్‌కు మళ్లీ విపరీతమై కడుపునొప్పి రావడంతో ఇంటివద్ద చనిపోయాడు. దీనిపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రెండు బొలెరో వ్యాన్లు ఢీ:

ఒకరికి గాయాలు

దత్తిరాజేరు: మండలంలోని ఎస్‌.బూర్జవలస పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రెండు బొలెరో వ్యాన్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై జి.రాజేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెర్లాం మండలం కుసుమూరు నుంచి గజపతినగరం వైపు సామగ్రితో వెళ్తున్న బొలెరో వ్యాన్‌ను వెనుక నుంచి వస్తున్న మరో బొలెరో వ్యాన్‌ ఢీకొనడంతో తెర్లాం మండలం కుసుమూరు గ్రామానికి చెందిన బడిమిశెట్టి శ్రీను కాలికి బలమైన గాయమైనట్లు ఎస్సై తెలిపారు. గాయాలపాలైన బడిమిశెట్టి శ్రీనును 108లో ఆస్పత్రికి తరలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సీహెచ్‌సీకి రోగుల తాకిడి

బాడంగి: స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రాని(సీహెచ్‌సీ)కి జ్వరం, డయేరియా రోగుల తాకిడి ఆదివారం పెరిగింది. ఆస్పత్రి నూతన భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఉన్నపాటి పాతభవన ఇరుకు గదుల్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఇన్‌పేషెంట్‌ వార్డులో మంచాలు చాలకపోవడంతో ఆస్పత్రి వరండాలో కూడా మంచాలు, బెంచీలు వేసి రోగులకు చికిత్స చేస్తున్నారు. దీంతో ఎక్స్‌రే, గైనకాలజిస్టు, ఇన్‌ఫెషెంట్‌ వార్డులోకి డాక్టర్లు, సిబ్బంది, రోగుల ధువులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన ఓపీరోగులకు కూడా ఆస్పత్రిలో చోటుచాలక ఆరుబయట చెట్లకింద ఓపీ టికెట్ల నమోదు, ఎన్‌ఓపీ బయోమెట్రిక్‌లు చేపడుతున్నారు. అత్యవసర వైద్యసేవలకోసం రిఫరల్‌ కేసులను తరలించేందుకు గతంలో అంబులెన్స్‌ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ వాహనం మూలకుచేరడంతో పేదరోగులు ప్రైవేట్‌ అంబులెన్స్‌లకు అద్దెలు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

చికెన్‌1
1/3

చికెన్‌

చికెన్‌2
2/3

చికెన్‌

చికెన్‌3
3/3

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement