
డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా.. కిమిడి నాగార్జున బాధ్య
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కిమిడి నాగార్జున ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ సీహెచ్.ఉమామహేశ్వరరావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కిమిడి నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, రైతులకు తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తానన్నారు. డీసీసీబీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన నాగార్జునకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి, కోండ్రు మురళీమోహన్, బోనెల విజయ్ చంద్ర, లోకం నాగమాధవి, పి.అదితి గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యేలు భంజ్దేవ్, కిమిడి గణపతిరావు, డాక్టర్ కేఏనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ
పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డీసీసీబీ సిబ్బంది అభినందనలు తెలిపారు.
డీసీఎంఎస్ సేవలను విస్తృతం చేస్తా
విజయనగరం ఫోర్ట్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ సేవలను విస్తృతం చేయడం ద్వారా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చైర్మన్ గొంప కృష్ణ అన్నారు. స్థానిక సంఘంకార్యాలయంలో ఆదివారం డీసీఎంఎస్ చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ప్రభుత్వం నుంచి లభించే గౌరవ వేతనం. ఇతర అలివెన్స్లు తీసుకోబోనని, ఆ డబ్బును డీసీఎంఎస్ బలోపేతం చేసేందుకు వినియోగిస్తానని ప్రకటించారు. డీసీఎంఎస్ ఫలాలను అందరికీ అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. సంఘం ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు. సేవలను మరింత ఎక్కువ మందికి అందిస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన కృష్ణను మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్, పి. అదితి గజపతిరాజు, బోనెల విజయచంద్ర, కోళ్ల లలితకుమారిలు అభినందించారు.

డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా.. కిమిడి నాగార్జున బాధ్య