‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..? | - | Sakshi
Sakshi News home page

‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?

Jun 1 2025 1:03 AM | Updated on Jun 1 2025 1:03 AM

‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?

‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?

కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటిబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీషబాబు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి దొంగలే చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ దొంగతనం జరిగిన ఇంటి పూజాగది, పరిసరాలను శుక్రవారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో రెండున్నర గంటల పాటు చర్చించి పలు సూచనలు చేశారు. దొంగతనం జరిగిన ఇంటి ముందు ఉన్న సీసీ కమోరా దొంగతనం జరిగిన రోజు సాయంత్రం 6 గంటలకు ఆగిపోవడం, కెమోరాకు సంబంధించిన వైరు తెగిపోయి ఉండడాన్ని చూసి.. అక్కడ నుంచే దర్యాప్తును ప్రారంభించారు. ట్రస్టులో పని చేస్తున్న ఐదుగురు వ్యక్తులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ జరపగా చోరీ చేసిన తీరును తెలిపినట్టు సమాచారం. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. చోరీ అంతా ట్రస్టులో పనిచేసే ఒక బిగ్‌బాస్‌ ఆధ్వర్యంలో జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బృందం శనివారం సాయంత్రం మరింత లోతుగా దర్యాప్తు చేసింది.

అసలు చోరీకి గురైన బంగారం ఎంత?

జగదీష్‌బాబు ఇంట్లో జరిగిన చోరీలో ఎంత మొత్తంలో బంగారాన్ని దొంగలు అపహరించుకుపోయారనే విషయంలో స్పష్టతలేదు. పోలీసులు మాత్రం కేవలం 90 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు పోయినట్టు కేసు నమోదు చేశారు. వాస్తవానికి అంతకు 10 రెట్లు బంగారం, పెద్ద మొత్తంలో నగదును దోచుకుపోయారన్న వాదన వినిపిస్తోంది. డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తును పర్యవేక్షించడం ఈ వాదనకు బలం చేకూరుతోంది.

ఇప్పటికే అదుపులో ఐదుగురు అనుమానితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement