
ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ: మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని కురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
రాజాం సిటీ: పట్టణ పరిధి డోలపేట శివాలయం వీధిలో నివాసం ఉంటున్న తాతపూడి దుర్గారావు (54) చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. సీఐ అశోక్ కుమార్, ఎస్సై రమణమూర్తి తెలిపిన వివరాల మేరకు రేగిడి మండలం పనసలవలస గ్రామానికి చెందిన దుర్గారావు రెండేళ్ల క్రితం డోలపేట వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేసి పెద్దకుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. 27 ఏళ్ల కుమారుడికి వచ్చిన సంబంధాలు కుదరడంలేదు. అలాగే ఈ నెల 23న కూడా సంబంధం వచ్చి కుదరకపోవడంతో దుర్గారావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మద్యం అలవాటు ఉన్న ఆయన మద్యం తాగి రాత్రి పదిగంటల సమయంలో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. 11 గంటల సమయంలో భోజనానికి పిలుస్తున్నా ఎప్పటికీ పలకకపోవడంతో ఎలాగోలా తలుపు తీశారు. అప్పటికే ఉరివేసుకున్న దుర్గారావును కిందికి దించి కొన ఊపిరితో ఉండడంతో శ్రీకాకుళంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి కుమారుడు ధనుంజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
రైల్వే గేటు సమీపంలో మృతదేహం
కొమరాడ: పార్వతీపురం గుమడ రైల్వేస్టేషన్ల మధ్య స్వామినాయుడు రైల్వే గేటు సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడి కుడిచేతిపైన అమ్మ అనే పచ్చబొట్టు ఉందని, నీలం రంగు నెక్ బనియన్, నలుపు రంగు షార్టు ధరించి ఉన్నాడన్నారు.ఐదు అడుగుల ఎనిమిది ఇంచిల పొడవు కలిగి లావుగా ఉన్నట్లు చెప్పారు. రంగు చామన ఛాయలో ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 8309901038 నంబర్లకు తెలియచేయాలని కోరారు.
గుర్తుతెలియని వ్యక్తి..
బొండపల్లి: మండల పరిధిలోని బొండపల్లి–చందకపేట గ్రామాల మధ్యలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ కృష్ణారావు తెలిపారు. టిట్లాఘర్ రైల్వే టికెట్ కలిగి ఉండి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉన్న, నీలిరంగు ఫుట్ టీషర్టు, నల్లరంగు ప్యాంటు ధరించి ఉన్న వ్యక్తి పట్టాలపై మృతి చెందినట్లు తెలిపారు. గుర్తు తె లియని వ్యక్తి రైలులో ప్రయాణం చేస్తూ ప్రమాదవశా త్తు జారిపడి మృతి చెందినట్లు భావిస్తున్నట్లు చెప్పా రు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని సర్వజన కేంద్రాస్పత్రికి తరలించామని మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయనగరం రైల్వే ఎస్సై ఫోన్ నంబర్ 9490617089, బొబ్బిలి, విజయనగరం జీఆర్పీ హె చ్సీల ఫోన్ 944101333095, 9591813163 నంబ ర్లను సంప్రదించి వివరాలు అందచేయాలని కోరారు.
విద్యుత్ షాక్కు గురై మూడు ఆవుల మృతి
పాచిపెంట: మండల కేంద్రానికి చెందిన రైతు మట్టపర్తి సురేష్కు చెందిన మూడు ఆవులు కొటికిపెంట పంచాయతీ గోగాడవలస సమీపంలో సాగు చేస్తున్న పొలం దగ్గర బుధవారం విద్యుత్ షాక్తో మతిచెందాయి. సోమవారం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు నేలకొరిగాయని విద్యుత్ అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోక పోవడం వల్ల తన ఆవులు మతి చెందాయని రైతు సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ట్రాక్టర్ కింద పడి విద్యార్థిని మృతి
బైక్ అదుపు తప్పి ప్రమాదం

ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..

ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..

ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..