
పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేద్దాం
పార్వతీపురం టౌన్: పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం క్లాత్బ్యాగ్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. జూన్ 5న వనం మనం కార్యక్రమంను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ శోభిక, డీఆర్వో కె.హేమలత, ఇంజినీర్ కరుణశ్రీ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్ లేదా క్లాత్ బ్యాగ్లు