హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

May 1 2025 1:24 AM | Updated on May 1 2025 1:24 AM

హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

సాలూరు: పాచిపెంట మండలం తంగ్లాం గ్రామంలో గిరిజనుడు పోయి అప్పలస్వామి హత్యకేసులో నిందితుడు పోయి రాజును అరెస్ట్‌చేసినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన పట్టణంలోని రూరల్‌ సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పలస్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారన్నారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా పోయి అప్పలస్వామిని హత్యచేసినట్లు నిందితుడు పోయి రాజు స్వయంగా వీఆర్‌ఓ వద్ద లొంగిపోయాడని తెలిపారు. భూ వివాదంతోపాటు చిల్లంగి అనుమానంతో అప్పలస్వామిని రాజు హత్యచేసినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. సమావేశంలో రూరల్‌ సీఐ రామకృష్ణ, పట్టణ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement