అన్యాయమనిపింఛన్‌..! | - | Sakshi
Sakshi News home page

అన్యాయమనిపింఛన్‌..!

Apr 30 2025 2:00 AM | Updated on Apr 30 2025 2:00 AM

అన్యా

అన్యాయమనిపింఛన్‌..!

అర్హులందరికీ పింఛన్‌ మంజూరుచేయాలి

నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించి ఏడాది కావస్తోంది. ఇంతవరకు పింఛన్‌ మంజూరు కాలేదు. కుటుంబాన్ని నడిపేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను. మాలాంటి అర్హులందరకీ వితంతు పింఛన్లు మంజూరు చేయాలి. నిబంధనలను విధించి పింఛన్‌లను మంజూరు చేయకపోవడం అన్యాయం.

–గనేడ గౌతమి, సాలూరు

పునరాలోచన చేయాలి

గడువును విధించి వితంతు పింఛన్లు మంజూరు చేయడం వల్ల నవంబర్‌ నెల ముందు వితంతువులైన మహిళలకు అన్యా యం జరుగుతుంది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న మహి ళలకు ప్రభుత్వం మరో కొత్త దుఃఖంను తెచ్చింది. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

– పాలక రంజిత్‌కుమార్‌,

గిరిజన సంఘనాయకుడు, పార్వతీపురం

పార్వతీపురం:

కూటమి నేతలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండమావిగా మార్చారు. సూపర్‌ సిక్స్‌ను అటకెక్కించారు. దీనిపై నిలదీస్తున్న ప్రజలను డైవెర్షన్‌ పాలిటిక్స్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా కొత్తపింఛన్ల మంజూరు మాటే ఎత్తడం లేదు. కనీసం భర్తలను పోగొట్టుకున్న భార్యలకు పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. పింఛన్‌ అందుకుంటున్న భర్త చనిపోతేనే భార్యకు వితంతు పింఛన్‌ అందజేస్తామన్న నిబంధన విధించడంపై మండిపడుతున్నారు. కూటమి నేతల పాలన, ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. సర్వే పేరుతో దివ్యాంగులను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుండడాన్ని కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. అర్హతలు పరిశీలించాకే గత ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందన్న విషయాన్ని మరిచిపోవడం తగదంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరుచేసేవారు. 2023 డిసెంబర్‌ వరకు అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యాయి. 2024 జూన్‌లో అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయా ల్సి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటివరకు జిల్లాలో 8 వేల మందికి పైగా పింఛన్‌కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా వ్యాప్తంగా కేవలం 1521 పింఛన్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇవి కూడా పింఛన్లు వచ్చిన భర్తలు చనిపోయిన వారి స్థానంలో వితంతువులకు మంజూరు చేసినవే. కొత్తగా దివ్యాంగులకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు నిండిన వెనుకబడిన వర్గాలకు ఒక్క పింఛన్‌ కూడా మంజూరు కాకపోవడం గమనార్హం.

అర్హులకు మంజూరుకాని పింఛన్లు

పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్‌ అట..

ఇదెక్కడి న్యాయమంటున్న వితంతువులు

సర్వే పేరుతో దివ్యాంగులకు ముప్పుతిప్పలు

50 ఏళ్లకే పింఛన్‌ హామీ ఊసెత్తని కూటమి నేతలు

పింఛన్ల కోసం 8వేల మంది ఎదురుచూపు

అన్యాయమనిపింఛన్‌..! 1
1/5

అన్యాయమనిపింఛన్‌..!

అన్యాయమనిపింఛన్‌..! 2
2/5

అన్యాయమనిపింఛన్‌..!

అన్యాయమనిపింఛన్‌..! 3
3/5

అన్యాయమనిపింఛన్‌..!

అన్యాయమనిపింఛన్‌..! 4
4/5

అన్యాయమనిపింఛన్‌..!

అన్యాయమనిపింఛన్‌..! 5
5/5

అన్యాయమనిపింఛన్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement