
మలేరియా మహమ్మారిని తరిమికొట్టాలి
● దోమల నివారణ మందును పిచికారీ చేయాలి
● ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి
సీతంపేట: గ్రామాల్లో మలేరియా మహమ్మారిని మూకుమ్మడిగా తరిమికొట్టాలని, దీనికోసం అన్ని గ్రామాల్లోనూ దోమల నివారణ మందు పిచికారీ చేయాలని ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి సూచించారు. స్థానిక ఐటీడీఏలో వివిధ శాఖలతో మంగళవారం నిర్వహించిన కన్వర్జెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా వ్యాధి వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. దోమల నివారణ మందును గ్రామాల్లో ప్రతీ ఇంటిలోను పిచికారీ చేయాలన్నారు. దీనిని సూపర్వైజర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. మలేరియా పాజిటివ్ కేసులు నమోదైన చోట ఇరుగు, పొరుగున ఉన్న వారికి కూడా రక్తపరీక్షలు చేయాలన్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, డీఎంఓ పి.వి.సత్యనారాయణ, సబ్యూనిట్ ఆఫీసర్ జె.మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.