అవసరమైతే విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

అవసరమైతే విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడి

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

అవసరమైతే విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడి

అవసరమైతే విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడి

ఐక్యవేదిక నాయకులు మక్కెన శ్రీనివాసరావు, సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబులు మాట్లాడుతూ.. నిరంకుశ అధికారులను నిలువరించి, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ పెడతామని ఇచ్చిన హామీ అమలు చేయని పక్షంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు మూడున్నర గంటలపాటు ఎండను సైతం లెక్కచేయకుండా కొనసాగించారు. అధికారులను, సిబ్బందిని డీఈవో కార్యాలయంలోనికి వెళ్లనివ్వలేదు. అనంతరం ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రకటించే కార్యాచరణకు అనుగుణంగా ముందుకు వెళతామని చెప్పి తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఐక్య వేదిక నాయకులు డీకే సుబ్బారెడ్డి, మొహమ్మద్‌ ఖాలీద్‌, కె.నరసింహారావు, సంపత్‌ బాబు, సోషలిజం, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రజిత్‌, ఎండీ ఉస్మాన్‌, టి.మోహనరావు, రామకృష్ణ, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, సాంబయ్య, పెద్ద సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement