
ముంబై ఐఐటీలో సీటు సాధిస్తాను
మా స్వస్థలం తెనాలి. నాన్న సతీష్కుమార్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. అమ్మ సరోజ గృహిణి. జేఈఈ అడ్వాన్స్డ్లో వచ్చిన 712వ ర్యాంకు ఆధారంగా ముంబై, చైన్నె, ఢిల్లీ ఐఐటీల్లో సీఎస్ఈలో చేరతాను. – నాళ్ల శాన్వీ సాయి వీర,
67వర్యాంకు, ఇంజినీరింగ్
గైనకాలజీ నిపుణురాలిగా ఎదుగుతాను
మాస్వస్థలం గుంటూరులోని గుజ్జనగుండ్ల. నాన్న రవికిరణ్ విద్యుత్శాఖలో జూనియర్ అసిస్టెంట్, అమ్మ మధురిమ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. నీట్లో వచ్చే ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్లో చేరతాను. పీజీ పూర్తి చేసి గైనకాలజీ నిపుణురాలిగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నాను.
– ఉప్పాల రూపశ్రీ, 40వ ర్యాంకు, అగ్రికల్చర్, ఫార్మసీ

ముంబై ఐఐటీలో సీటు సాధిస్తాను