
ఇద్దరు మావోయిస్టులు అరెస్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలో శుక్రవారం ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు. మత్తిలి పోలీసు స్టేషన్ పరిధిలోని సోడిగూడ వద్ద వీరిని పట్టుకున్నట్లు చెప్పారు. కొరాపుట్ నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్తుండగా డీవీఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గాంగులూర్కు చెందిన రాకేష్ కుంజం అలియాస్ మున్న కుంజం, కేశు కబాసిగా గుర్తించారు. సుక్మా జిల్లా కాంగేర్ఘాటి ఏరియా కమిటీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వీరిపై రూ.4లక్షలు చొప్పున మొత్తం రూ.8లక్షలు రివార్డు ఉంది. వీరి వద్ద నుంచి రెండు రివాల్వర్లు, సాహిత్యం, వాకీటాకీ బ్యాటరీ, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు మావోయిస్టులు అరెస్టు