
వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో వేర్వేరు చోట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కార్యాలయం సమీపంలో పోలీసులు తనిఖీ చేశారు. ఆర్జే 08 జీఏ 4204 నంబర్ గల ట్రక్ని ఆపి డ్రైవర్ పరారయ్యాడు. అందులో సురుమి గ్రామానికి చెందిన మోహనరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనం తనిఖీ చేయగా 1084 కిలోల గంజాయి దొరికింది. స్టేషన్ అధికారిణి మమతా పండా కేసు నమోదు చేసి, గంజాయితో పాటు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
జయపూర్ నుంచి విశాఖ పట్నం వెళ్తున్న కిరండోల్ రైలులో కొరాపుట్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ముగ్గురు మహిళా ప్రయాణికుల బ్యాగ్లలో 30 కిలోల గంజాయి దొరికింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు గంజాయి స్మగ్లర్లని తేలింది. దీని విలువ రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ముగ్గురు నిందితురాళ్లు న్యూఢిల్లీకి చెందిన షర్మిలా,మౌనిక,రాధికగా పేర్కొన్నారు. ఈ గంజాయి విశాఖ నుంచి న్యూఢిల్లీ తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం

వేర్వేరు చోట్ల గంజాయి స్వాధీనం