
ఆదర్శ గ్రామాలుగా ప్రముఖుల జన్మ స్థలాలు : సీఎం
భువనేశ్వర్: రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో 21 మంది గొప్ప వ్యక్తుల విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. విగ్రహాల ఆవిష్కరణ మాత్రమే కాదు, ఈ గొప్ప వ్యక్తుల జన్మస్థలాల్ని ఆదర్శ గ్రామాలుగా ఆవిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. ఆయా గ్రామాల్లో స్మారక సంగ్రహాలయాలు, ఉపన్యాస కేంద్రాలు, పిల్లల పార్కులు, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 నుంచి 150 గ్రామాల్లో పలువురు ప్రముఖులు జన్మించారు. అలాంటి ప్రముఖ వ్యక్తులు జన్మించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీతలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులతో జరిగిన ప్రతిస్పందన సదస్సులో ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు.

ఆదర్శ గ్రామాలుగా ప్రముఖుల జన్మ స్థలాలు : సీఎం