చీకటి గదిలో జగన్నాథుడు | - | Sakshi
Sakshi News home page

చీకటి గదిలో జగన్నాథుడు

Jun 13 2025 5:35 AM | Updated on Jun 13 2025 5:35 AM

చీకటి

చీకటి గదిలో జగన్నాథుడు

పర్లాకిమిడి: శ్రీజగన్నాధ స్వామికి దేవస్నానం జరిగిన అనంతరం గత రాత్రి చీకటి గదిలో స్వామివారిని ఉంచారు. దీంతో పురుషోత్తముడు పద్నాలుగు రోజులు ఉండి ఉక్కపోతకు గురౌతారు.

లోయలో పడిన అంబులెన్స్‌

రాయగడ: జిల్లాల్లోని కెందుగుడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గొయిబొందొ మలుపు వద్ద అంబులెన్స్‌ అదుపుతప్పి 30 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అంబులెన్స్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి అంబులెన్స్‌లో రోగిని బరంపురం తరలించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్‌ నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గాయపడిన ఫార్మాసిస్ట్‌, డ్రైవర్‌, హెల్పర్‌ను అటువైపుగా వస్తున్న మరో అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. రాయగడ జిల్లా కేంద్ర ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌గా సమాచారం.

పశువుల తరలింపు అడ్డగింత

నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా గేదెలను తరలిస్తుండగా నరసన్నపేట పోలీసులు అడ్డుకున్నారు. బరంపురం నుంచి రాజమండ్రికి బొలెరే వ్యాన్‌లో ఐదు గేదెలను తరలిస్తుండగా మడపాం టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించా రు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాహనాన్ని సీజ్‌ చేశారు. గేదెలను అలమండ గోశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.4.95 లక్షలు

పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.4,95,520 ఆదాయం లభించింద ని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. 30 రోజులకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ హుండీని గురువారం లెక్కించామని, టెక్కలి గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణా ధికారి టి.పి.మనస్వి పర్యవేక్షించారన్నారు. కా ర్యక్రమంలో సుదర్శన్‌, శ్రీ వెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

తప్పిన ప్రమాదం

కొత్తూరు: కొత్తూరులోని పాలకొండ రోడ్డులో త్రినాథ స్వామి ఆలయం వద్ద ఏర్పడిన భారీ గోతిలో గురువారం ఓ ఆటో దిగబడింది. వర్షం కారణంగా గోతుల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పడిపోయిన సమయంలో ఆటో వెనుక ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ముగ్గురు తహశీల్దార్లకు బదిలీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరే ట్‌ జి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ జి.ఎల్‌.శ్రీనివాస్‌ ను లావేరు తహశీల్దార్‌గా నియమించారు. పాతప ట్నం తహశీల్దార్‌ సనపల కిరణ్‌కుమార్‌ రణస్థలం మండలం బదిలీ అయ్యారు. రణస్థలం తహశీల్దార్‌ గా పనిచేసినఎం.ప్రసాదరావును పాతపట్నం తహశీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రెండు ఆలయాల్లో చోరీ

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని కనుగులవానిపేట గ్రామంలో గల పొదిలాపు అమ్మవారి గుడితో పాటు పక్కనే గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత దొంగతనం జరిగింది. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన పురోహితుడు తలుపులు బార్లా తెరిచి ఉండడడంతో గ్రామస్తులకు విషయం చేరవేశారు. వారు వెంటనే శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనంలో రూ.2వేలు నగదుతో పాటు ఇతరత్రా వస్తువులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులురాలు కనుగుల అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చీకటి గదిలో జగన్నాథుడు 1
1/3

చీకటి గదిలో జగన్నాథుడు

చీకటి గదిలో జగన్నాథుడు 2
2/3

చీకటి గదిలో జగన్నాథుడు

చీకటి గదిలో జగన్నాథుడు 3
3/3

చీకటి గదిలో జగన్నాథుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement