
శ్రీమందిర్లో దీపకాంతులకు సన్నాహాలు
భువనేశ్వర్: పూరీ మందిరం దీపాలంకరణతో కొత్త రూపు దాల్చనుంది. శ్రీ మందిరం, ప్రధాన దేవస్థానం సముదాయంలో పార్శ్వ ఆలయాలు కొత్త కాంతులతో సిద్ధం కానున్నాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సహాయంతో ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై శ్రీమందిరం కార్యాలయంలో ప్రధాన పాలకుడు (సీఏఓ) డాక్టర్ అరవింద కుమార్ పాడీ అధ్యక్షతన గురువారం ముఖ్యమైన సమావేశం జరిగింది. శ్రీమందిరం సీనియర్ ఇంజినీర్లు, ఏఎస్ఐ పూరీ సర్కిల్ అధికారులు, ఢిల్లీలోని ఏఎస్ఐ గుర్తింపు పొందిన సంప్రదింపుల సంస్థ ప్రతినిధి శిల్పి భరద్వాజ్ హాజరయ్యారు. వివిధ వారసత్వ ప్రాజెక్టుల కోసం చేసిన విద్యుద్దీప అలంకరణ పనులకు సంబంధించి సంబంధిత సంస్థలు వివరాల్ని ప్రదర్శించాయి. ప్రతిపాదిత దీపకాంతుల కోసం శ్రీమందిరం పాలకవర్గం కొన్ని నిర్ధిష్ట సూచనలను జారీ చేసింది. భారత పురావస్తు శాఖ సాంకేతిక సలహా, మార్గదర్శకత్వంతో వివరణాత్మక నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. పాలక మండలి ఆమోదం కోసం సకాలంలో నివేదిక దాఖలు చేయాలని సమావేశంలో చర్చించారు. తదనంతరం అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ఆలయ సముదాయం విద్యద్దీప కాంతుల పనుల కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని నిర్ణయించారు.
ఏఎస్ఐ ఆధ్వర్యంలో డీపీఆర్
రూపకల్పన