
ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన
కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజధాని భువనేశ్వర్లో జరిగిన ఆందోళనలో కొరాపుట్ జిల్లాల నేతలు కీలక భూమిక వహించారు. గురువారం ప్రతి పక్ష బీజేడి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధికారంలోనికి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర బీజేడి ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో, రాష్ట్ర సాధారణ కార్యదర్శులు రమేష్ మజ్జి, ప్రదిప్ మజ్జి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మజ్జి, కౌసల్య హిక్కా తదితరులు అరెస్టయ్యారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన