ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ

Jun 13 2025 5:09 AM | Updated on Jun 13 2025 5:09 AM

ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ

ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ

అరసవల్లి: రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాలకు కొత్తగా ఆస్తులను సమకూర్చేలా చర్యలు చేపడతామని, తద్వారా ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆలయ ఈఓ కేశవమఠం నాగవెంకట దుర్గా వరప్రసాద్‌ స్పష్టం చేశారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వా మి ఆలయానికి కొత్త ఈఓ (డిప్యూటీ కమిషనర్‌)గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశ ర్మ ఆలయ సిబ్బంది కలిసి గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించా రు. అనంతరం కొత్త ఈఓ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆలయాలకు సమీ పంలో అభివృద్ధికి ఆస్కారమున్న పరిసర ప్రాంతాలను రెవెన్యూ దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, ఆలయ ఆస్తులను పెంచేలా చర్యలు చేపడతామన్నా రు. అరసవల్లి ఆలయానికి కూడా పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలు అంశం పెండింగ్‌లో ఉన్నట్లు గా సమాచారం ఉందని, దీన్ని త్వరితగతిన పూర్తి చేయించి తద్వారా ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. భక్తులకు కూడా ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా అసౌకర్యం కలిగితే నే రుగా తనను సంప్రదించవచ్చునని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement