ఘనంగా అష్టోత్తర కలశ మహాభిషేకం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అష్టోత్తర కలశ మహాభిషేకం

Jun 12 2025 3:05 AM | Updated on Jun 12 2025 3:05 AM

ఘనంగా అష్టోత్తర కలశ మహాభిషేకం

ఘనంగా అష్టోత్తర కలశ మహాభిషేకం

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథుని మహాభిషేకం అంగరంగ వైభవంగా ముగిసింది. అశేష భక్త జనం మధ్య మూల విరాటులు సుగంధిత జలంతో మహా స్నానం ఆచరించారు. శ్రీ మందిరం సముదాయం ఉత్తర దిశలోని బంగారు బావి నుంచి తోడిన నీటిలో సుగంధిత పుష్ప, చందనాదులు ఇతరేతర సుగంధ ద్రవ్యాల్ని జోడించి బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనునికి జలాభిషేకం నిర్వహించారు. అష్టోత్తర కలశాలతో ఈ అభిషేకం నిర్వహించడం విశేషం. జగన్నాథుడు అత్యధికంగా 35 కలశాల జలంతో స్నానం ఆచరించగా 33 కలశాలతో బలభద్ర స్వామి, 22 కలశాలతో దేవీ సుభద్ర, 18 కలశాలతో సుదర్శన భగవానునికి సుగంధిత జలంతో స్నాన మండపంపై అభిషేకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement