ఉత్సాహంగా పిండివంటల పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా పిండివంటల పోటీలు

Jun 12 2025 3:05 AM | Updated on Jun 12 2025 3:05 AM

ఉత్సా

ఉత్సాహంగా పిండివంటల పోటీలు

పర్లాకిమిడి: పట్టణంలోని బిజూ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా స్థాయి సుభద్ర శక్తి పండివంటల పోటీలను మిషన్‌ శక్తి డి.పి.ఎం. టిమోన్‌ బోరా ఆధ్వర్యంలో నిర్వహించారు. సబ్‌కలెక్టర్‌ అనుప్‌ పండా, జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి తదితరులు హాజరై వంటకాలను పరిశీలించారు. ఉపాధి రాగులు, కొర్రలు, ఇతర పిండివంటలు విక్రయం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలని సబ్‌కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఏడు సమితిల నుంచి 26 డ్వాక్రా మహిళా గ్రూపుల మహిళలు హాజరై పాయసం, కోంకడాల పులుసు, బూరెలు, గారెలు తదితర వంటకాలు చేశారు. గుమ్మా బ్లాక్‌ ఝామి గ్రామానికి చెందిన అంజనా శక్తిదళ్‌, మోహనా, పర్లాకిమిడి గ్రూపులు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని డీపీఎం తెలిపారు. విజేతలకు ఈ నెల 14న గజపతి స్టేడియంలో జరిగే మెగా వంటలు, పండ్ల ప్రదర్శనలో మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ సమక్షంలో బహుమతులు అందజేస్తామని చెప్పారు.

ఉత్సాహంగా పిండివంటల పోటీలు1
1/4

ఉత్సాహంగా పిండివంటల పోటీలు

ఉత్సాహంగా పిండివంటల పోటీలు2
2/4

ఉత్సాహంగా పిండివంటల పోటీలు

ఉత్సాహంగా పిండివంటల పోటీలు3
3/4

ఉత్సాహంగా పిండివంటల పోటీలు

ఉత్సాహంగా పిండివంటల పోటీలు4
4/4

ఉత్సాహంగా పిండివంటల పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement