
పూరీలో సేవాయత్ హత్య
భువనేశ్వర్: పవిత్ర స్నానోత్సవం భారీ స్థాయిలో జరుగుతుండగా పూరీ పట్టణంలో సీనియర్ సేవాయత్ దారుణ హత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక గుడియా సాహిలో జరిగిన ఈ ఘటనలో మృతుడు మహి ప్రకాష్ మఠానికి చెందిన 84 ఏళ్ల జగన్నాథ్ దీక్షిత్గా గుర్తించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా నారాయణ్ పట్టజోషిని ప్రధాన నిందితునిగా గుర్తించి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షలు కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీ జగన్నాథుని స్నానోత్సంలో తన వంతు పొంతిబొడు సేవ ముగించి తిరిగి వస్తుండగా జగన్నాథ్ దీక్షిత్ హత్యకు గురయ్యాడు. జగన్నాథ్ను తన ఇంటికి రమ్మని పిలిచి దారిలో రబేణి చౌరస్తా సమీపంలో నారాయణ్ పట్టజోషి హత్య చేశాడు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని విడిచి పెట్టి నిందితుడు సైకిల్పై పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరి దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు.

పూరీలో సేవాయత్ హత్య