
గణపతి స్వరూపుడిగా జగన్నాథుడు
భువనేశ్వర్: స్నాన యాత్ర కోసం విచ్చేసిన భక్తులు, యాత్రికులకు జగన్నాథుడు మహా గణపతి స్వరూపంలో దర్శన భాగ్యం కల్పించాడు. ఏటా జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా మహా స్నానం అనంతరం నిత్యం శ్రీ మందిరం రత్న వేదికపై దర్శనం ఇచ్చే మూల విరాటులు గజానన అలంకరణలో శోభిల్లుతారు. స్థానిక రాఘవ దాసు మఠం క్రమంతప్పకుండా గజానన అలంకరణ సామగ్రి, సరంజామా ఏర్పాటు చేస్తుంది. స్నానోత్సవంలో ఈ దర్శనం అంతిమ ఘట్టం.
ఐటీడీఏ సమావేశంలో ఆగ్రహావేశాలు
కొరాపుట్: జిల్లాలో ఆశ్రమ పాఠశాలల పనితీరుపై బుధవారం నిర్వహించిన ఐటీడీఏ సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డీఎన్కే సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల్లో సమస్యలు తిష్ట వేశాయని, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోతుందన్నారు. సీఎల్పీ నాయకుడు రాంచంద్ర ఖడం మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చులు చేస్తున్నా గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. సమావేశంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తివాసన్, ఎమ్మెల్యే రఘురాం మచ్చో తదితరులు పాల్గొన్నారు.
బొరిగుమ్మ విద్యార్థినికి
11వ ర్యాంక్
జయపురం: + 2 కామర్స్ 2025 పరీక్షలో బొరిగుమ్మ రోయల్ హయ్యర్ సెకెండరీ స్కూల్ విద్యార్థిని కె.వినీత రాష్ట్ర టాపర్లలో 11వ స్థానం సాధించింది. విద్యార్థిని 93.33 శాతం మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్గా నిలిచినందుకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, బంధువు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

గణపతి స్వరూపుడిగా జగన్నాథుడు

గణపతి స్వరూపుడిగా జగన్నాథుడు