
నేటి నుంచి అలార్నాథ్ ఆలయ దర్శనం
భువనేశ్వర్: పవిత్ర స్నాన యాత్ర ప్రభావంతో జగన్నాథునితో సహా తోబుట్టువులు బలభద్ర స్వామి, దేవీ సుభద్ర జ్వరం బారిన పడ్డారు. స్నాన మండపం నుంచి మూల విరాట్లకు బుధవారం రాత్రి అనవసర మండపాని తరలించారు. శ్రీమందిరం రత్న వేదిక బోసిబోయింది. ఈ ప్రాంగణంలో భక్తులకు నిత్య దర్శనం తాత్కాలికంగా ముగిసింది. ఈ సందర్భంగా పూరీ నుంచి స్వల్ప దూరంలో బ్రహ్మగిరి ప్రాంతంలో కొలువై పూజలందుకంటున్న అలార్నాథ్ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. గురువారం నుంచి ఈ దేవస్థానం భక్తులు, యాత్రికుల తాకిడితో కిటకిటలాడుతుంది.
విస్తృత ఏర్పాట్లు..
ఈ సందర్భంగా స్థానిక యంత్రాంగం అలార్నాథ్ ఆలయం ప్రాంగణంలో విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. అదనపు పోలీసు సూపరింటెండెంట్, నలుగురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో సహా సీనియర్ అధికారులతోపాటు మొత్తం 7 ప్లాటూన్ల పోలీసులతో ఒక సెక్షన్ సాధారణ దుస్తుల పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. సులభ దర్శనం కోసం ఆలయం వద్ద ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం సర్వ దర్శనం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26 వరకు అలార్నాథ్ స్వామి దర్శనం కోసం భక్తులు తరలివస్తారు. భారీ స్నానం ఆచరించడంతో అనారోగ్యానికి గురైన మూల విరాట్లు కోలుకునేందుకు పక్షం (15) రోజులు పడుతుంది. అంత వరకు ప్రధాన దేవ స్థానంలో మూల విరాట్ల దర్శనం ప్రాప్తించదు. ఈ నిడివిలో బ్రహ్మగిరిలో కొలువు దీరిని అలార్ నాథ్ స్వామిని దర్శించుకుంటే జగన్నాథుని దర్శించుకున్న మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.
భద్రత కట్టుదిట్టం