
పిడుగుపాటుకు మూడు పశువులు మృతి
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సికరపాయి పంచాయతీ తొలొసొజ్జ గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మూడు పశువులు మృతి చెందాయి. ఇవి గ్రామంలోని పాయికొ మినియాక, జగరావు మినియాకలకు చెందినవిగా గుర్తించారు. మేత మేస్తుండగా పిడుగు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులకు నష్టపరిహారం చెలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
యువకుడు ఆత్మహత్య
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితిలో బుధవారం అజిత్ ముజుందర్ అనే యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా తలుపులు తీయకపోవడంతో దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా అజిత్ ఓ గదిలో చీరతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

పిడుగుపాటుకు మూడు పశువులు మృతి