రూ.25 లక్షల పరిహారం అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల పరిహారం అందజేయాలి

Jun 11 2025 11:48 AM | Updated on Jun 11 2025 11:48 AM

రూ.25 లక్షల పరిహారం అందజేయాలి

రూ.25 లక్షల పరిహారం అందజేయాలి

జయపురం: కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ వైద్య కళాశాల హాస్పిటల్‌లో ఇటీవల తప్పుడు ఇంజక్షన్‌తో మరణించిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా కమ్యూనిస్టు పార్టీ బొయిపరిగుడ శాఖ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఆ పార్టీ బొయిపరిగుడ బ్లాక్‌ కార్యదర్శి సూర్యనారాయణ బిశాయి జిల్లా ప్రధాన వైద్యాధికారికి రాసిన 4 డిమాండ్లతో ఉన్న లేఖను బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌ వైద్యాధికారికి అందజేశారు. ఆరుగురు మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. వైద్యుల నిర్యక్ష్యం వలన మరణాలు సంభవించాయని ఆరోపించింది. మరణించిన వారి కుటుంభాలకు పరిహారం చెల్లించటంతోపాటు తప్పుడు ఇంజక్షన్‌ ఇచ్చిన డాక్టర్‌కు కఠిన శిక్ష విధించాలని, సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ వైద్య కళాశాల హాస్పిటల్‌, జిల్లా కేంద్ర హాస్పిటల్‌లో అగినంత మంది డాక్టర్లతోపాటు వైద్య సిబ్బందిని నియమించాలని, ఖాళీలు ఉన్న పదవులను వెంటనే భర్తీ చేయాలని, అత్యాధునిక వైద్య పరికరాలతోపాటు ప్రాణ రక్షక ఔషధాలను రోగులకు సమకూర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పార్టీ కార్యకర్తలు లక్షోమీ బారిక్‌, దశరథ ఖిలో, నవీన బారిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement