
విజిలెన్స్ వలలో ఇద్దరు మహిళా ఇంజినీర్లు
కొరాపుట్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు ప్రభుత్వ మహిళా ఇంజినీర్లు విజిలెన్స్ వలకు చిక్కారు. మంగళ వారం కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితిలో అసిస్టెంట్ ఇంజినీర్ సుచిస్మిత పరజా రూ.8 వేలు లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఘాట్ రోడ్డు లో కటింగ్ పనులు చేసిన కాంట్రాక్టర్ను లంచం అడగడంతో ఆయన విజిలెన్స్ను సంప్రదించగా మాటు వేసి పట్టుకున్నారు. మరో వైపు బరగడ్ జిల్లా గయిసిలేట్ సమితి లో జూనియర్ ఇంజినీర్ సుస్మితా ఓరం మంగళ వారం విజిలెన్స్ వలకు చిక్కారు. బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ వద్ద నుంచి 10 శాతం కమిషన్ కావాలన్నారు. అందుకు తక్షణం రూ.32,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో కాంట్రాక్టర్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయగా వారిచ్చిన రూ.8 వేలు తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.

విజిలెన్స్ వలలో ఇద్దరు మహిళా ఇంజినీర్లు