దారి కాచిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దారి కాచిన మృత్యువు

Jun 11 2025 7:48 AM | Updated on Jun 11 2025 7:48 AM

దారి

దారి కాచిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మృతులంతా ఒడిశా వాసులే

టెక్కలి రూరల్‌: దైవ దర్శనానికి బయల్దేరిన వారికి చావు ఎదురైంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు జంక్షన్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఒడిశా వాసులు మృతిచెందారు. సింహాచలం అప్పన్న దర్శనానికి బయల్దేరగా.. కోటబొమ్మాళి మండలం వద్ద ప్రయాణం ముగిసిపోయింది. ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురం రాధాకృష్ణ వీధికి చెందిన కొందరు బొలేరో వాహనంపై తమ గ్రామం నుంచి సింహాచలం దైవ దర్శనానికి బయల్దేరారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్దకు వచ్చే సరికి వాహనం రోడ్డుపక్కన ఆపి కిందకు దిగుతుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లగేజీ బొలేరో వ్యాన్‌ వీరిని అమాంతం ఢీకొట్టింది. బొలేరో వాహనంలో ఉన్న ఒడిశాకు చెందిన 8 మంది వ్యక్తులు అందులో ఉండగా.. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ గోకుల్‌ పండా(33), సుశాంత్‌ కుమార్‌ సబత్‌(44) అతని కుమార్తె సంతోషి సబత్‌(7) అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లాగేజ్‌ వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై నందిగాం ఎస్‌ఐ మహ్మద్‌ ఆలీ కేసుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దారి కాచిన మృత్యువు1
1/3

దారి కాచిన మృత్యువు

దారి కాచిన మృత్యువు2
2/3

దారి కాచిన మృత్యువు

దారి కాచిన మృత్యువు3
3/3

దారి కాచిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement