
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
జయపురం: జయపురంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సోమవారం సాయంత్రం హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. స్థానిక అరవింద నగర్ విద్యామందిరం ప్రాంగణంలో నిర్వహించినన కార్యక్రమంలో పట్టణ ఆర్ఎస్ఎస్ ప్రతినిధి డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ అధ్యక్షత వహించారు. మహారాజ్ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజూను హిందూ సామ్రాజ్య దినంగా రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘం పాటిస్తున్నదని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ చంధ్ర బెహర, ముఖ్యవక్తగా నవరంగపూర్ ఆర్ఎస్ఎస్ పట్టణ సంఘ సలక్ రాజేంద్ర కుమార్ భిశాయి, జయపురం పట్టణ సంఘ సలక్ ప్రేమానంద నాయిక్ పాల్గొన్నారు. సురేష్ నంద, అమృత బచన్ గంగాధర నాయిక్, ప్రధాన శిక్షకులు సుభ్రత పండలు దేశభక్తి గీతాలు ఆలపించారు.

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం