
‘స్టీల్ప్లాంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల పోరాటంపై పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రా ష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యాజ మాన్యం ఉక్కు కార్మికులపై కక్ష కట్టాయని, కార్మికులను తీవ్రంగా భయపెట్టి, తొలగించి, పోలీస్ నిర్బంధంతో ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటంపై ఉక్కుపాదం మోపాయని అన్నారు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులున్నా ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే సొంత గనుల్లేవని అన్నా రు. టీడీపీ, జనసేన నాయకత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని కోరారు.