
సెమల వంతెన.. నాణ్యత ఇంతేనా..?
జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి భనసులి పంచాయతీ సెమల గ్రామంలో రూ.3కోట్ల 83 లక్షల వ్యయంతో రూరల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా నిర్మిస్తున్న వంతెన పనుల్లో అప్రోచ్ రోడ్డు పనుల్లో నాణ్యత లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల వద్ద కాంట్రాక్టర్ కానరావటం లేదంటున్నారు. నాణ్యతాహీనంగా పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని దుయ్యబడుతున్నారు. వారానికి ఒక సారి సమితి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి అధికారులు వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని మాజీ సర్పంచ్ నరేంధ్ర మఝి తో పాటు వార్డు సభ్యుడు త్రిపతి నాయిక్,తో పాటు కలియ నాయిక్,యాదవ నాయిక్,ధన్సింగ్ నాయిక్,సమురు పొరజ,లకుము సమరత్ తదితరులు కోరుతున్నారు. అయితే పనుల్లో అక్రమాలేవీ జరగలేదని జూనియర్ ఇంజినీర్ చెబుతున్నారు. జయపురం

సెమల వంతెన.. నాణ్యత ఇంతేనా..?

సెమల వంతెన.. నాణ్యత ఇంతేనా..?

సెమల వంతెన.. నాణ్యత ఇంతేనా..?