
కొలనార సమితిలో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. జిల్లా కమెక్టర్ ఫరూల్ పట్వారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యవర్గ నిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఏడీఎం పబ్లిక్ హెల్త్ మమత సాహు, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 21 వినతులను కలెక్టర్ పట్వారి ప్రజల నుంచి స్వీకరించారు. ఇందులో 14 వ్యక్తిగతమైనవికాగా మరో ఐదు వినతులు గ్రామసమస్యలుగా గుర్తించి వీటిని సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇద్దరి చికిత్స కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 38 వేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
మీనాజోలకు బస్ సేవలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని అత్యంత వెనుబడిన సమితిగా గుర్తింపు పొందిన మీనాజోలకు బస్ సేవలు సొమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పర్యాటక ప్రాంతమైన మీనాజోలలో ప్రముఖ పాతాలేశ్వర శైవక్షేత్రం ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే సరైన రాకపొకలకు సంబంధించి బస్సు సౌకర్యాలు లేకపొవడంతో ఆటోలపైనే ఆధారపడేవారు. ఇటీవల జిల్లాలోని పర్యటించిన రాష్ట్ర రవాణా, వాణిజ్య, గనుల శాఖల మంత్రి బిభూతి భూషన్ జెన్న పర్యటించినప్పుడు మీనాజోల శైవక్షేత్రం వద్ద గల జనకల్యాణ ఆశ్రమానికి చెందిన స్వామి జనకా నంద గిరి సమస్యను మంత్రి దృష్టికి తీసకువెళ్లారు. స్పందించిన మంత్రి గుణుపూర్ వయా మీనాజోల వరకు బస్ సేవలు అందించాలని ఆర్టీవోకు ఆదేశించారు. దీంతో సోమవారం నుంచి ఇక్కడకు బస్ సేవలు ప్రారంభం కావడంతో మంత్రి జెన్నకు ధన్యవాదాలు తెలియజేశారు.
తమ్ముడిపై అన్న దాడి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బోండఘాటీ పోల్లగూఢ గ్రామంలో అన్నదమ్ములు భూతగాదాలో కొట్టుకున్నారు. అన్న హర ముదిలి కోపంతో తమ్ముడు తిరుపతిపై బాణంతో దాడి చేశాడు. ఛాతీపై బాణం దిగడంతో అతడిని వెంటనే ఖోయిర్పూట్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొరాపుట్ తరలించారు. విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముగిసిన శిక్షణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ఈత శిక్షణ సోమవారంతో ముగిసింది. ఉత్తమశిక్షణ దారులకు బహుమతులు అందజేశారు. చెరువుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నిరోధించడానికి శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు కొరాపుట్ నుంచి 30 మంది వచ్చారని, ఏడు సమితులకు చెందిన 300మందికి ఈత నేర్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ పాల్గొని విజేతల పిల్లలకు ప్రమాణ పత్రాలు అందజేశారు.

కొలనార సమితిలో వినతుల స్వీకరణ

కొలనార సమితిలో వినతుల స్వీకరణ

కొలనార సమితిలో వినతుల స్వీకరణ