రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా నిరసన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా నిరసన

Jun 10 2025 3:18 AM | Updated on Jun 10 2025 3:18 AM

రాష్ట

రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా నిరసన

పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్లపై దాడులు, హింస జరుగుతున్నాయని వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని కోరుతూ రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా అధ్యక్షుడు ప్రమోద్‌ నిషాంత్‌ మాట్లాడుతూ, మణిపూర్‌లో క్రిస్టియన్స్‌పై దాడుల వల్ల 250 మంది మైనార్టీలు చనిపోయారని, 360 చర్చిలు ధ్వంసం అయ్యాయని, 70 వేల మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని భారత రాష్ట్రపతి పేరిట రాసిన వినతిని గజపతి కలెక్టరేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌కు వినతిని అందజేశారు. ఈ నిరసనలో అమోద్‌ కుమార్‌ బర్ధన్‌, ఇంద్రమోహాన్‌ నాయక్‌, ఇసాక్‌ బిశోయి తదితరులు ఉన్నారు.

రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా నిరసన 1
1/1

రాష్ట్రీయ క్రిస్టియన్‌ మోర్చా నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement