
రోగులకు సముచిత వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
జయపురం: రోగులకు సముచిత వైద్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర అన్నారు. జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో నూతన అంబులెన్స్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో అంబులెన్స్ కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త అంబులెన్స్ రాకతో వారి కష్టాలు తీరుతాయని తెలిపారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోదీ ప్రజలకు ఉచిత వైద్య సౌకర్యం కోసం ఆయుష్మాన్భవ కార్డులు కూడా అందజేశారని తెలిపారు. అంబులెన్స్ ప్రారంభోత్సవంలో కమ్యూనిటీ హాస్పిటల్ అధికారి డాక్టర్ సారధీ ప్రసాద్ ముని, హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గజ వాహనంపై శ్రీవారు
రాయగడ: స్థానిక బాలాజీనగర్లో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో సోమవారం స్వామి వారు గజవాహనంపై తిరిగారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

రోగులకు సముచిత వైద్యమే ప్రభుత్వ లక్ష్యం