
యువకుని అనుమానాస్పద మృతి
రాయగడ: ఒక యువకుని మృతదేహాన్ని మునిగుడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించిన మృతదేహాన్ని గుర్తించిన కొందరు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. సంఘటన స్థలం వద్ద ఒక బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మృతుడు జిల్లాలొని తెరువలి ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ దేవ్ (30)గా గుర్తించారు. మృతదేహాన్ని బట్టి ఇది హత్యాలేక ఆత్మహత్యా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.