
‘పనితీరును ప్రజలకు చెబుదాం’
రాయగడ: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు బీజేపీ చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, వాటి తీరుతెన్నుల విషయమై ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అందుకు రాష్ట్రంలో గల ప్రతి జిల్లా కేంద్రంలొ వికాష్ మేళా పేరిట ప్రదర్శనలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని రాష్ట్ర రవాణా, వాణిజ్య, గనుల శాఖల మంత్రి బిభూతి జెన్న అన్నారు. రాయగడలొ ఒక్కరొజు పర్యటనకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా స్థానిక డీఆర్డీఏ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రదర్శన మేళాను ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలొ బీజేపీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా చోటు చేసుకున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు స్టాల్లను ఏర్పాటు చేసి ప్రదర్శించాలని అన్నారు. గుర్తింపు పొందిన జిల్లాల్లో కృషక్ మేళా, నారిశక్తి , యువశక్తి, ఆదివాసీ మేళాలను విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలొ కలెక్టర్ ఫరూల్ పట్వారి, జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశం పూర్తయిన అనంతరం మంత్రి జెన్న విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలే భవిష్యత్లో పార్టీ మనుగడకు ఊపిరి పోస్తాయన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ కృషి చేస్తుందని అన్నారు. రాయగడలో గల ఔస్ఆర్టిసి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఉన్న బస్సులు పాతబడటంతో రద్దు చేయడంతో అందులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగుల భవిష్యత్ అంధకారంగా మారిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ త్వరలో ప్రభుత్వం కొత్త బస్సులను ఏర్పాటు చేసి యథావిధిగా కొనసాగిస్తుందని అన్నారు.

‘పనితీరును ప్రజలకు చెబుదాం’

‘పనితీరును ప్రజలకు చెబుదాం’