
పికప్ వ్యాన్ను ఢీకొన్న ట్యాంకర్
రాయగడ: కర్రల లోడుతో వెళుతున్న ఒక పికప్ వ్యాన్ను ట్యాంకర్ ఢీకొనడంతో కార్మికుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం సదరు సమితి పరిధిలో గల జేకేపూర్ సమీపంలో గల నాగావళి బ్రిడ్జి మధ్యలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి పెంట గ్రామానికి చెందిన జారంగ జముకగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొలనార నుంచి కళ్యాణసింగుపూర్ వైపు కర్రల లోతుడో పికప్ వ్యాన్ వెళ్తోంది. ఈ క్రమంలో నాగావళి బ్రిడ్జి మధ్య వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పికప్ వ్యాన్ బ్రిడ్జికి ఒక వైపుగా ఒరిగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పికప్ వ్యాన్ను ఢీకొన్న ట్యాంకర్