సాంఘిక పరివర్తనకు రచనలతో ప్రయత్నం | - | Sakshi
Sakshi News home page

సాంఘిక పరివర్తనకు రచనలతో ప్రయత్నం

Sep 22 2023 1:54 AM | Updated on Sep 22 2023 1:54 AM

పుస్తకావిష్కరణలో అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీ నారాయణ, తదితరులు
 - Sakshi

పుస్తకావిష్కరణలో అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీ నారాయణ, తదితరులు

విజయనగరం అర్బన్‌: తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ పాఠశాలలో గురువారం జరిగిన గురజాడ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ చాలా రచనలు చేసినప్పటికీ సమాజంలో మార్పు కోరుతూ రాసిన కన్యాశుల్కం నాటకం పేరుగాంచిందన్నారు. నేటి విద్యార్థులు గురజాడ అప్పారావును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కవితాస్రవంతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్‌ ఎంవీకృష్టాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌, కార్యదర్శి శరత్‌ చంద్రజ్యోతి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్‌చలం, ఆర్‌.బాలకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూడిశేఖర్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement