విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jun 13 2025 5:01 AM | Updated on Jun 13 2025 5:01 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2025
సమస్యల మధ్యే ప్రారంభం

7

దుర్గమ్మ సేవలో..

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుష్మ గురువారం దర్శించుకున్నారు. ఈవో శీనానాయక్‌ ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

ఎస్‌ఎంసీకి

కొత్త ప్రిన్సిపాల్‌

డాక్టర్‌ ఏవైరావు బాధ్యతలు స్వీకరణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలో డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు(ఏవై రావు) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన డాక్టర్‌ పి. అశోక్‌కుమార్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

క్రమశిక్షణ.. సమయపాలన..

ఈ సందర్భంగా డాక్టర్‌ ఏడుకొండలరావు మాట్లాడుతూ కళాశాలలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించేలా చూస్తామన్నారు. నిత్యం కళాశాల, విద్యార్థులు హాస్టల్స్‌లో రౌండ్స్‌ వేస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు అకడమిక్‌ కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తానన్నారు. వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు ఎప్పుడైనా నేరుగా తనను కలవచ్చని, వెయిటింగ్‌ లేకుండా ఎప్పుడూ తలుపులు చెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వైద్యులు సిబ్బందితో సమన్వయం సమష్టి కృషితో ముందుకెళ్దామని పేర్కొన్నారు. కాగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలరావును అభినందించిన వారిలో పూర్వ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. అశోక్‌కుమార్‌, ఏడీ శ్రీకాంత్‌, ఇతర ప్రొఫెసర్‌లు, అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బంది ఉన్నారు.

గ్రీన్‌ ట్యాక్స్‌పై జీవోను విడుదల చేయాలని వినతి

విజయవాడస్పోర్ట్స్‌: ఏడేళ్లు దాటిన సరుకు రవాణా వాహనాలపై గ్రీన్‌ ట్యాక్స్‌ను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు అన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డిని ఈశ్వరరావు అసోసియేషన్‌ ప్రతినిధులతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్‌ట్యాక్స్‌ తగ్గింపునకు జీవోను వెంటనే విడుదల చేయాలని మంత్రిని ఆయన కోరారు. దీనిపై మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ వారంలోనే ట్యాక్స్‌ తగ్గింపుపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగుమోతు రాజా, కార్యదర్శి సీహెచ్‌ వినయ్‌ ఉన్నారు.

తైక్వాండోలో జిల్లాకు

68 పతకాలు

విజయవాడస్పోర్ట్స్‌: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మూడు రోజుల పాటు జరిగిన 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఈ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల సబ్‌ జూనియర్‌, క్యాడెట్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు 68 పతకాలను సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, కోచ్‌లు పి.విక్టర్‌ ఆదిత్య, కె.కృష్ణవంశీ, బి.దినేష్‌, బి.కాశీనాథ్‌రెడ్డి, పి.గౌరిశంకర్‌, ఎం.బాలచందర్‌ అభినందించారు.

చాలీ చాలని జీతాలతో బతికేదెలా?

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): చాలీచాలని జీతాలతో బతుకీడ్చేదెలా అంటూ మున్సిపల్‌ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అలంకార్‌ సెంటర్‌ ధర్నా చౌక్‌లో వారు గత నెలరోజులుగా ధర్నా చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో యూనియన్‌ నగర అధ్యక్షుడు పిట్టా మహేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మూడు దఫాలు చర్చల పేరుతో పిలిచి ఎటువంటి హామీ గానీ, ఉత్తర్వులు గాని ఇవ్వలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ నాయకులు వేముల జైపాల్‌, పరసా బుచ్చిబాబు, బి.నాగరాజు, సీహెచ్‌ సాంబశివరావు, పి.కృష్ణ, ఎండీ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగిన షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో పది, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు అందించిన పురస్కారాలు దానిని రుజువు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అడుగడుగునా ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి అండగా నిలిచింది. సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. కానీ ప్రస్తుత కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు పూర్తిగా కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించేదిగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 174 మందికి సత్కారాలు..

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మండలాల్లో కులాల ప్రతిపాదికన విద్యార్థులను ఎంపిక చేసింది. ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు పురస్కారాన్ని సైతం అందించాలని నిర్ణయించింది. పదో తరగతికి సంబంధించి 131 మందికి, ఇంట ర్మీడియెట్‌ కోర్సులకు చెందిన 43 మందికి ఈ అవార్డుల కోసం ఎంపిక చేసి ప్రదానం చేశారు.

సర్వత్రా విమర్శలు..

ప్రభుత్వం తానిచ్చే పురస్కారాలు, అవార్డులు తొలుత ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇవ్వటం పరిపాటి. పేద, మధ్య తరగతి అత్యధికంగా చదువుకునే ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించటం ద్వారా మరింత మంది ఆ విధమైన స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారు. మరిన్ని విజయాలను సాధించేందుకు అది ఆదర్శంగా నిలుస్తుంది. కానీ జిల్లాలో సోమవారం అందించిన అవార్డులు దాదాపుగా 90 శాతం ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకే అందించింది. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధించినా ప్రైవేట్‌ విద్యార్థులకు అవార్డులు ఇవ్వటం ఏమిటని విద్యారంగ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.

ఆ ప్రభుత్వ బడులకు మొండి చెయ్యి..

ఎన్టీఆర్‌ జిల్లాలో 20 మండలాలకు చెందిన విద్యార్థులను విద్యాశాఖ కులాల ప్రతిపాదికన ఎంపిక చేసింది. అందులో భాగంగా కేవలం ఎనిమిది మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అందులో ఎంపిక చేయటం వివాదాస్పదమవుతోంది. 12 మండలాలకు చెందిన ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ విద్యార్థికి ఈ పురస్కారాల్లో అవకాశం లభించలేదు. మిగిలిన ఎనిమిది మండలాలకు సంబంధించి నాలుగు మండలాలకు ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారు. మిగిలిన మండలాలకు చెందిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కులు సాధించినా, ఆ మండలాల ప్రభుత్వ బడుల విద్యార్థులను దూరం పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో 131 మందిని పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయగా అందులో 19 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 112మంది పూర్తిగా కార్పొరేట్‌ సంస్థలకు చెందిన విద్యార్థులే. అలాగే ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 43 మందిని ఎంపిక చేయగా అందులో కేవలం పది మంది మాత్రమే ఎయిడెడ్‌, ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 33 మంది పూర్తిగా కార్పొరేట్‌ విద్యార్థులే.

విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న మంత్రి సత్యకుమార్‌,

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ(ఫైల్‌)

గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్‌,

ఎండీ రుహుల్లా, మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి తదితరులు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ విమర్శించారు. జిల్లాలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్‌, ఎండీ రుహుల్లాలతో కలిసి ఆయన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి వివరించారు. వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాజ్‌భవన్‌ ఎదుట మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ వైఫల్యాలపై..

జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ చేస్తున్న దందాలు గవర్నర్‌కు వివరించామని అవినాష్‌ చెప్పారు. అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, జర్నలిస్టుల అరెస్టులను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాతవాహన కళాశాల భూ కబ్జా, సాక్షి కార్యాలయాలపై దాడులు, వైఎస్‌ జగన్‌ పొదిలి పర్యటనలో జరిగిన రాళ్ల దాడిని గవర్నర్‌కు వివరించామన్నారు.

మరో బిహార్‌గా మార్చారు..

మల్లాది విష్ణు మాట్లాడుతూ రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ఏపీని మరో బిహార్‌గా మార్చేసిందన్నారు.. కూటమి ఏడాది పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, హామీల ఎగవేత వంటి 10 అంశాలతో గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చామన్నారు. మొండితోక అరుణకుమార్‌ మాట్లా డుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కూటమి పెద్దలు కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన భధ్రత విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏ రవిచంద్ర తదితరులు ఉన్నారు.

గవర్నర్‌కు వినతి పత్రం అందజేసిన ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకులు

న్యూస్‌రీల్‌

జిల్లాలో 12 మండలాల ప్రభుత్వ బడులకు మొండి చెయ్యి మార్కులు సాధించినా.. అవార్డులకు ఎంపిక కాని వైనం ఎంపికై న ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున నగదు అందజేత

విజయవాడ నుంచి ఒక్కరూ లేరు..

విజయవాడ పశ్చిమ, తూర్పు, ఉత్తరం, అర్బన్‌, విజయవాడ రూరల్‌ మండలాలు చాలా ప్రధానమైనవి. ఈ పరిసర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు వంద వరకూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఈ విద్యా సంస్థల నుంచి ఒక్క విద్యార్థిని కూడా విద్యాశాఖ ఎంపిక చేయలేదు. ఎయిడెడ్‌, నగరపాలకసంస్థ, ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన పదో తరగతి విద్యార్థులు అవార్డులు సాధించిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కులు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికీ విద్యాశాఖ అమలు చేసిన నిర్ణయం తీవ్రమైన అన్యాయం చేసిందంటూ ఉపాధ్యాయులు సైతం విమర్శిస్తున్నారు.

విజయవాడ సిటీ1
1/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/10

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement