
కృష్ణా నదీ తీరంలో రికార్డ్ యోగా
భవానీపురం(విజయవాడపశ్చిమ): యోగాంధ్ర– 2025 కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖకు చెందిన విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో బుధవారం వివిధ రకాల బోట్లపై 2 వేల మంది యోగాసనాలు ప్రదర్శించి వరల్డ్ రికార్డు సాధించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నేతృత్వంలో కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేసిన వాటర్ క్రాఫ్ట్ ్స – ఫ్లోటింగ్ మెగా యోగా ఈవెంట్లో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాఽథ్తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్స్కీ వంటి అనేక వాటర్ క్రాఫ్ట్ ్సతో పాటు పున్నమిఘాట్లో ఏర్పాటు చేసిన తివాచీలపై దాదాపు 2 వేల మంది యోగాసనాలు ప్రదర్శించారు. వాటిన్నంటినీ నిశితంగా పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్యు) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచ రికార్డ్ సాధించినట్లు ప్రకటించారు. ఒక నదిలో అత్యధిక మందితో వివిధ రకాల బోట్లపై యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ– పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రలకు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఏబీసీ సీఈఓ తరుణ్ కాకాని, వీఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఆయుష్ వైద్యులు వి.రాణి, రామత్లేహి, రత్న ప్రియదర్శిని, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా అధికారులు ఎ.శిల్ప, జి. జ్యోతి, జె.సుమన్, పి.లావణ్య కుమారి, తహసీల్దార్లు ఇంతియాజ్ పాషా, రోహిణీ దేవి, సుగుణ కుమారి, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
వేదికగా విజయవాడ బెరంపార్క్, పున్నమిఘాట్

కృష్ణా నదీ తీరంలో రికార్డ్ యోగా