
పోలీస్ స్పందనకు 64 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 64 మంది ఫిర్యాదులను అందజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించి 34, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించి 9, దొంగతనాలు 03 , కొట్లాటలు 02, సైబర్ నేరాలు 03, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 13 ఫిర్యాదులను స్వీకరించామని డీసీపీ తెలిపారు.