రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం

Jun 7 2025 1:44 AM | Updated on Jun 7 2025 1:44 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం

ముండ్లపాడు క్రాస్‌రోడ్స్‌(పెనుగంచిప్రోలు):రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని జాతీయ రహదారిపై ముండ్లపాడు క్రాస్‌రోడ్స్‌ వద్ద చోటు చేసుకుంది. గొల్లపూడి నుంచి పెళ్లి సరుకులతో వెళ్తున్న ట్రాలీ ఆటో జాతీయ రహదారిపై నుంచి పెనుగంచిప్రోలు వెళ్లేందుకు సర్వీసు రోడ్డులోకి తిరుగుతుండగా వెనుక నుంచి తెనాలి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆటో పల్టీ కొట్టగా కారు పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మంగళగిరికి చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ జానీ(55)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యమంలో మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌, కూకట్‌పల్లికి చెందిన విష్ణుబొట్ల శంకర్‌ భార్య ఇద్దరు పిల్లలకు ఎటువంటి గాయాలు కాలేదు. కారులో వారు సీటు బెల్టు పెట్టుకోవటంతో పాటు ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం1
1/1

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement